విద్యుత్ షాక్ తో బాలుడు మృతి
కురవి మండలం కందికోండ గ్రామానికి చెందిన నీలారపు అఖిల్ (15) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు విద్యుత్ షాక్ రావడంతో శనివారం మృతి చెందారు. అందరితో మంచిగా ఉండే బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అఖిల్ ఈ సంవత్సరమే పదోతరగతి పూర్తి చేసుకున్నాడు.