Jul 20, 2024, 03:07 IST/ములుగు
ములుగు
వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై కమలాకర్
Jul 20, 2024, 03:07 IST
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల ప్రజలు వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పస్రా ఎస్సై కమలాకర్ సూచించారు. వర్షాల వల్ల కాలువలు, చెరువులు ఉప్పొంగే అవకాశం ఉందని, మండలంలోని యువకులు చెరువుల వద్దకు చేపలు పట్టేందుకు, ఈతకు వెళ్లకూడదని ఎస్సై సూచించారు. వర్షాకాల నేపథ్యంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.