ములుగు జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జాయింట్ డైరెక్టర్

73చూసినవారు
ములుగు జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జాయింట్ డైరెక్టర్
ములుగు జిల్లా ఆసుపత్రిని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ చంద్రారెడ్డి బుధవారం సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్, ప్రోగ్రాం ఆఫీసర్ పొరిక రవీందర్ తో కలిసి యాంటి రెట్రో వైరల్ థెరపీ కేంద్రాన్ని పరిశీలించారు. థెరపీ కేంద్రం ఏర్పాటుతో ములుగు జిల్లాలోని 209 మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సకాలంలో ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుందని అన్నారు.