ప్రధాన రహదారిపై మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు

65చూసినవారు
ప్రధాన రహదారిపై మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని ప్రధాన రహదారులపై రైతులు మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని ఆదివారం దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రధాన రహదారులపై మొక్కజొన్నలు ఆరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందువల్ల రైతులు తాము ఏర్పాటు చేసుకున్న కల్లాల్లోనే మొక్కజొన్నలు ఆరబోసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్