ఈనెల 23న ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశాలను విజయవంతం చేయండి

296చూసినవారు
ఈనెల 23న ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశాలను విజయవంతం చేయండి
ఈనెల 23న జరుగు ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయాలని ఏ ఐ ఎఫ్ డి ఎఫ్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు పిలుపునివ్వడం జరిగింది. స్థానిక ఓంకార్ భవన్లో డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ కమిటీ సభ్యుడు పెరుక వంశి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం మార్త నాగరాజు మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేయాలని అన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వాన నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ కోచింగ్ క్లాసు లా పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల వద్దనుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఈనెల 23న ఏ ఐ ఎఫ్ డి ఎఫ్ వరంగల్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నర్సంపేటలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి భారీ మొత్తంలో విద్యార్థులు పాల్గొని జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు రాకేష్ బిందు రాజేష్ శ్యామ్ స్రవంతి అఖిల వంశీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్