వల్మీడికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

1543చూసినవారు
అంత్యంత ప్రసిద్ధిగాంచిన జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో గల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. బుధవారం నిర్వహించనున్న శ్రీసీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుకల్ని కనులారా చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణమండపంలో వేడుకల్ని నిర్వహించేందుకు ఆలయ ఉత్సవకమిటీ పూర్తిఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :