విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో విద్యుత్ షాక్ తో పశువు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కుంట నరసయ్య పొలంలో మెతమేస్తూ దుక్కిటేద్దు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, గ్రామంలో పంటపొలాల్లో అంత్యంత క్రిందికి ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి నష్టం వాటిల్లిందని తెలిపారు.