బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సయ్య మృతి
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేషపెల్లి నర్సయ్య (75) అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా వారి భౌతికదేహానిపై కడవెండి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటిపేల్లి మహేష్ పూలమాల వేసి నివాళులు అర్పించి గులాబీ కండువా కప్పి వారి సేవలను గుర్తు చేశారు.