దామెర మండలం కొగిల్వాయి గ్రామంలోని చంద్రగిరి శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయాన్ని శుక్రవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామిని దర్శించుకొని, పూజలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటి సారిగా గ్రామానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి అర్చనలు చేసి సన్మానించారు.