గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో పట్టి కొబ్బరికాయలు కొట్టి, స్వామికి నీళ్ళు పోసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.