జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం మహమ్మద్ కైసర్ పాషా(35) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సోమవారం జనగామ వైపు వెళ్తున్నాడు. నిడిగొండ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.