ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రులలో భాగంగా గురువారం మూడవరోజు అమ్మవారికి కనకాంబర పూలతో లక్ష పుష్పార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి మహా హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులలో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.