వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో అధికారులు నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం అదనపు బ్యాలెట్ యూనిట్ లను కేటాయించారు.