అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

51చూసినవారు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన బేతి మహేందర్ మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమార్తె వివాహానికి చేసిన అప్పులు, కుటుంబ పోషణ నిమిత్తం, వ్యవసాయం కోసం తెచ్చిన రుణం రోజురోజుకు పెరుగుతూ రూ. 11 లక్షలు అయ్యింది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 18న పురుగుమందు తాగాడు. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్