ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అవకాశమిచ్చి తెలివైనవారని నిరూపించుకున్నారని రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నారు. వారి తెలివితేటలు, ముందుచూపు చూసి గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజలు పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చి, ఉత్తి మాటలు చెప్పేవారికి బుద్ది చెప్పారన్నారు. గత పదేళ్లలో చేసిన అభివృద్ధి వేగం పెంచుతామని, రానున్న ఐదేళ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.