ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని, ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.