మా ప్రాణాలు తీశాకే.. ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలి: బండి సంజయ్

74చూసినవారు
మా ప్రాణాలు తీశాకే.. ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలి: బండి సంజయ్
హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లు చేసింది. హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ వసూళ్లకు తెరదీస్తోంది. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటాం. మా ప్రాణాలు తీశాకే.. ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలి. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్‌గానే ఉద్యమిస్తుంది' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్