ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం: జూపల్లి

69చూసినవారు
ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం: జూపల్లి
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10వేల పరిహారం అందజేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ రైతులను ఆదుకోలేదన్నారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామని వెల్లడించారు.