ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్మహల్ పేరు బాగా వినిపించింది. అయితే దానిని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే సీఎం రేఖ గుప్తా తాజాగా వెల్లడించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తామని, మార్చి 8 నాటికి ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని చెప్పారు. సీఎంగా తనని ఎంపిక చేసినందుకు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.