కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి

77చూసినవారు
కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి
నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తాజాగా మాట్లాడారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. అవసరమైతే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని, విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :