మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మేడారం జాతర ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా చాలా మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామన్నారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులున్నారని అన్నారు.