‘‘పథకాలకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయని అంటున్నారు. జగన్ ఎక్కడి నుంచి తెచ్చారు. సాక్షి నుంచి తెచ్చారా? భారతి సిమెంట్ అమ్మి తెచ్చారా?‘‘ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కూటమి మేనిఫెస్టోను మీముందు పెట్టాం, అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి జగన్ను బస్ డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. కానీ, రివర్స్లో వెళ్లాడు. డ్రైవింగ్ రానివారు రివర్స్లో వెళ్తే ఏమవుతుందో ఈ రాష్ట్రంలో అదే జరిగింది. బుద్ధి ఉన్నవారు ఎవరైనా రివర్స్ టెండరింగ్ పెడతారా? అని ప్రశ్నించారు.