హిందూ పురాణాల ప్రకారం.. ఇప్పటికీ జీవించి ఉన్న సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. మధ్యప్రదేశ్లో అసిర్గత్ అనే ప్రాంతంలో ఉన్న శివలింగానికి రోజూ సాయంత్రం వచ్చి పూజలు చేస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అక్కడి పరిసర వాసులు కొంతమంది అశ్వత్థామను చూసినట్లు కూడా చెబుతుంటారు. అందుకే నిత్యం సూర్యాస్తమయ సమయానికి ఆ కోటని మూసివేస్తారు. కేవలం దివ్య శక్తులు ఉన్నవారే అందులోకి ప్రవేశించగలరని చెబుతారు.