జగన్ పాలనలో మంచి రాష్ట్రం సర్వ నాశనమైందని, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని తెలిపారు. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని, హత్య జరిగాక ఘటనాస్థలికి వెళ్లిన సీఐ సీబీఐకి విషయం తెలపడానికి సిద్ధపడ్డారని తెలిపారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందని గుర్తు చేశారు. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి నెలకొందన్నారు.