కేకేఆర్పై ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో ఇకపై ఆడే మ్యాచ్లు నామమాత్రమే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, బుమ్రాలకు జట్టు రెస్ట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వారిద్దరూ తీరిక లేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. విశ్రాంతినిస్తే టీ20 వరల్డ్ కప్లో గాయాలపాలు కాకుండా ఉంటారని అంటున్నారు. మరి అభిమానుల కోరికను ముంబై గౌరవిస్తుందా? రేపు హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది.