యూపీలోని బరేలీలోని షాహీ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గత రాత్రి శిష్గఢ్-ధనేత రహదారిపై తన తల్లి ఇంటి నుంచి వస్తున్న వివాహితను దుండగులు కాల్చి చంపారు. భర్తను తుపాకీతో కొట్టి గాయపరిచి.. మహిళ నగలను దోచుకుని దుండగులు పరారయ్యారు. సమాచారమందుకున్న గ్రామస్థులు షాహి-శిష్గఢ్ రహదారిని దిగ్బంధించారు. భర్తకు స్వల్ప గాయాలు కావడంతో పోలీసులు అనుమానాస్పదంగా పరిగణించి విచారిస్తున్నారు.