సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. మెడికల్ కాలేజ్ కోసం తమ భూమి తీసుకొని ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఓ మహిళా రైతు కేటీఆర్ ను నిలదీశారు. దీంతో స్పందించిన కేటీఆర్ కలెక్టర్ తో మాట్లాడి ఫ్లాట్ ఇప్పిస్తానని కేటీఆర్ బదులివ్వగా 'ఇంకెప్పుడు ఇస్తారు?' అంటూ ఆమె ప్రశ్నించారు. అనంతరం పలు సమస్యలను ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.