టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్తో న్యూయార్క్లో హోటళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. జూన్ 9న భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుండటంతో హోటళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగాయి. ప్రస్తుతం అక్కడ కొన్ని హోటళ్లలో రూమ్స్ ధర రూ.9,422గా ఉంటే.. మ్యాచ్ ఉన్న రోజు ఈ ధర రూ.66,624గా ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి రాగా హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి.