బొమ్మలరామారం: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు

84చూసినవారు
బొమ్మలరామారం: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు
రైతు భరోసా కల్పించాలని బొమ్మలరామారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ, 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నిర్వీర్యమని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ సంపూర్ణంగా అమలు కాలేదని తెలిపారు. ప్రజా పాలన అని చెప్పుకోవడమే తప్ప ప్రజలను గాలికి వదిలేసారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.