భువనగిరి పార్లమెంట్ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్థిగా బుధవారం ముసునూరి గణేష్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాన్ని భువనగిరి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి హనుమంతు కె. జెండగే కు అందజేశారు. ప్రజల కోసం పోరాడే నాయకుడిని జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.