యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలేరు శాసనసభ్యులు సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ ఆడెపు విజయస్వామి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.