వైసీపీ లీడర్‌ అరాచకం.. జనసేన జెండాపై మూత్రం!

71చూసినవారు
ఏలూరు జిల్లా నూజివీడులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు జనసేన పార్టీ జెండాపై వైసీపీ నేత మూత్రం పోసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 1న అర్ధరాత్రి నూజివీడులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆగిరిపల్లి మండలానికి చెందిన వైసీపీ నేత బెజవాడ హర్ష.. మహేష్ అనే జనసేన నేత కారుపై ఉన్న పార్టీ జెండాను గమనించి దానిపై మూత్రం పోసాడు. సీసీ కామెరాల సాక్ష్యాలు చూపించి వైసీపీ నేతపై పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్