డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేసే ఓ యువతి(18) లఖ్నవూలోని తన ఇంటికి వెళ్లింది. ఏప్రిల్ 7న తిరుగు ప్రయాణమైన ఆమె తన స్నేహితుడు వివేక్ ను కలిసింది. డ్రగ్స్ తీసుకుంటే థ్రిల్ వస్తుందని చెప్పి వివేక్ తన ప్లాట్లో యువతికి సిరంజిని ఇంజెక్ట్ చేశాడు. డ్రగ్ డోస్ ఎక్కువ కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.