నడిరోడ్డుపై పోలీసులు ఎదుటే కొట్టుకున్న యువకులు (వీడియో)

64చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌ లో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డులో కోర్టు గేటు వద్ద ఇద్దరు యువకులు చిన్న వివాదం కారణంగా ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఇద్దరు పోలీసులు వారిని విడదీస్తున్నా కూడా ఆగలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.