పోలీస్ స్టేషన్ లోనే గొడవకు దిగిన యువకులు.. వీడియో

64చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఛపర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ తిరహా ఔట్‌పోస్టు వద్ద రెండు వర్గాలు దాడికి దిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ రోడ్డు ప్రమాదం విషయంలో ఇరువర్గాలు ఈ పిఎస్ వద్ద రాజీ కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో వివాదం తలెత్తి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమనిగింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్