హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

83చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి
ప్రముఖ యూట్యూబర్‌ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, అత్యాచారం చేసి, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ హర్షసాయిపై సినీ నటి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు, పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు. దీంతో హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్