పవన్ కళ్యాణ్ కటౌట్ కు క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే

పెందుర్తి మండలం అప్పన్నపాలెం పోలితల్లి ఆలయ వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్షలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పాల్గొన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి కలిపి అపచారం చేశారని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు పలు ప్రాంతాల్లో దీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కటౌట్ కు ఎమ్మెల్యే, జనసేన నాయకులు క్షీరాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్