దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే

పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో జనసేన ప్రచార కమిటీ సభ్యుడు ఉరిటి లక్కీ గోవిందు ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులు దీక్ష చేస్తున్న ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే వారిని అభినందించారు. పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు చేస్తున్న దీక్షకు జనసేన నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల దీక్షలు చేస్తుండడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్