వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరి పరిధిలో ఈ ఘటన జరిగింది. మోటార్లకు మీటర్లు బిగిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ విద్యుత్ సిబ్బందిని రైతులు హెచ్చరించారు. పంచాయతీ అనుమతి లేనిదే మీటర్లు బిగించరాదని సిబ్బందిని వెనక్కి పంపించారు.