దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’కు ఎంపికైన బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్ర
మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికే ఠాకూర్ కుటుంబాన్ని ప్రధాని ఆహ్వానించారు. ఠాకూర్ కుమారుడు, జేడీ(యూ) నేత రామ్నాథ్ ఠాకూర్ సహా కుటుంబసభ్యులతో
మోదీ ముచ్చటించారు. తన తండ్రిని ‘భారతరత్న’తో గౌరవించినందుకు ప్రధానికి రామ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.