ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్కు బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.