ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: తహసిల్దార్

భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తవణంపల్లె తహశీల్దార్ సుధాకర్ సోమవారం సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులతో సమావేశం నిర్వహించి విధులు కేటాయించామని చెప్పారు. భారీ వర్షంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్