పూతలపట్టు: అన్నదానం భవన పనులను పరిశీలించిన ఈఓ

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదానం భవన పనులను దేవస్థానం ఈవో గురు ప్రసాద్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు చేయాలని వారికి సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ఏఈ శివాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్