ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని’ ధీమా వ్యక్తం చేశారు.