దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపుల కలకలం రేగింది. ఇటీవల పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఇవాళ ఉదయం నాలుగు ఆస్పత్రులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. జీటీబీ హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెగ్డేవర్ హాస్పిటల్, దీప్ చంద్ర బంధు హాస్పిటల్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అయితే ఆ కాల్స్ను పరిశీలిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.