బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ సిరీయస్గా తీసుకున్నారు. బాన్సువాడలో ఆయనకు చెక్ పెట్టేందుకు సమర్దవంతమైన నేతకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నారట. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్కు బాధ్యతలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.