తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయినప్పటి నుంచి 8 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శనివారం పేర్కొంది. కేజ్రీవాల్ బరువు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. వచ్చే వారం రిజర్వ్లో ఉంచిన తీర్పును ప్రకటించే అవకాశం ఉంది.