నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం ఇస్తోంది. రూ.కోటి లోన్ తీసుకుంటే రూ.50 లక్షల సబ్సిడీ లభిస్తుంది. అయితే యూనిట్లో 500 ఆడ మేకలు/గొర్రెలు, 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రంతో దీనికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.nlm.udyamimitra.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.