బీహార్లోని బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తెల్హడ ప్లస్ టూ పాఠశాలలోకి ప్రవేశించి ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు బృందం పూర్తి స్థాయిలో ఘటనా స్థలానికి చేరుకుని ఇన్చార్జి ప్రిన్సిపాల్ ని ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.