త్వరలో 22 కొత్త పాలసీలు

69చూసినవారు
త్వరలో 22 కొత్త పాలసీలు
ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన మరో 22 కొత్త పాలసీలను త్వరలో తీసుకురానుంది. పర్యాటక, పారిశ్రామిక, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించబోతోంది. వాటిని సిద్ధం చేయాల్సిందిగా వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ విధానాలను ఈ నెల 30లోగా కేబినెట్ ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్